ఆచూకీ దొరకని ఏఎన్-32 విమానం
Published Saturday, 23 July 2016చెన్నై : ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఏఎన్-32 విమానం గల్లంతై 30గంటలైనా ఆచూకీ లభించలేదు. శనివారం తాంబరం ఎయిర్వేస్కు చేరుకున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు. విమానం కోసం జరుగుతున్న గాలింపు వివరాలను తెలుసుకున్నారు. చెన్నైకి 280 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిందని భావిస్తున్నా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి జాడ దొరకలేదు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి గాలింపును కొనసాగిస్తున్నారు. తాంబరంలో పరిస్థితి టెన్షన్ టెన్షన్గా ఉంది. అక్కడున్న ఎయిర్బేస్కు భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. వారిని అదుపు చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది.