రైలుఢీకొని మహిళా కూలీ మృతి
Published Monday, 25 July 2016పొన్నూరు, జూలై 24: నిడుబ్రోలు పిబిఎన్ కళాశాల సమీపాన ఆదివారం సాయంత్రం రాజధాని ఎక్స్ప్రెస్ రైలుఢీకొని ఓ మహిళాకూలీ మృతిచెందింది. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన రావూరి నాగేంద్రం (45)గా స్థానికులు గుర్తించారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. పొలం పని ముగించుకుని రైల్వేట్రాక్ మీదుగా ఆలూరుకు వెళ్తుండగా రైలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.