కార్యకర్తల మనోభావాలను గౌరవించి పనిచేయాలి
Published Monday, 25 July 2016గుంటూరు (కొత్తపేట), జూలై 24: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాధులని, నాయకులు, కార్యకర్తల మనోభావాలను గౌరవించి పనిచేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం బృందావనగార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో రేపల్లె, వినుకొండ, పొన్నూరు, గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ నియోజకవర్గాల సమక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపేధ్యేయంగా పనిచేయాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు మాట్లాడుతూ పేదరికం లేని సమాజం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కష్టపడి పనిచేస్తున్నారని, ఆయనకు చేదోడు, వాదోడుగా పార్టీ నాయకులు పనిచేయాలని కోరారు. కందుకూరులో జరిగే తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులకు నియోజకవర్గాల నుండి హాజరుకావాలని కోరారు.