పేరాలలో దొంగతనం
Published Monday, 25 July 2016చీరాల, జూలై 24: పేరాలలోని అన్నదాతవారి వీధిలో ఆదివారం దొంగతనం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కె శ్రీనివాసరావు తన భార్య పావనితో కలిసి గుంటూరులోని అత్తగారి ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆయన తల్లి రావమ్మ ఒక్కతే ఉంది. ఈ క్రమంలో ఇంటి వరండాలో పడుకున్న రావమ్మ ఉదయం నిద్ర లేచి చూసే సరికి ఇంటి తలుపు తెరిచి ఉంది. ఇంట్లో ఉన్న 8 సవర్ల బంగారం, 15 తులాల వెండితో పాటు రూ. 5వేలు నగదు అపహరణకు గురైనట్లు ఆమె గుర్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్టీం, డాగ్ స్క్వాడ్లు ఆధారాల కోసం ప్రయత్నించారు. డిఎస్పీ ప్రేమ్కాజల్, క్లూస్ టీం సిఐ రాజు, రెండో పట్టణ ఎస్సై వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.