మధుకేశ్వరుని దర్శించిన డిఆర్వో కృష్ణ్భారతి
Published Monday, 25 July 2016జలుమూరు, జూలై 24: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో కొలువైయున్న మధుకేశ్వరస్వామిని జిల్లా రెవెన్యూ అధికారిణి కృష్ణ్భారతీ ఆదివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ఆమెను అర్చకులు ఆశీర్వచనాలు పలికి చరిత్ర, శిల్పసంపదల అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఆలయ ప్రాంగాణంలో కొలువైయున్న వారాహి అమ్మవారిని దర్శించి కుంకుమ పూజలు చేపట్టారు. ఆమెతోపాటు తహశీల్దార్ కె.ప్రవల్లిక ప్రియ, కార్యనిర్వహణాధికారి నారాయణ, స్థానిక రెవెన్యూ అధికారి బగ్గు కళ్యాణి పలువురు పాల్గొన్నారు.