ఆదిత్యునికి స్వల్పంగా తగ్గిన భక్తుల తాకిడి
Published Monday, 25 July 2016శ్రీకాకుళం(టౌన్), జూలై 24: ఆదినారాయణుడు, ఆరోగ్య ప్రధాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు సందడి అంతంతమాత్రంగానే ఉంది. స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం ఎపుడూ భక్తులు పోటెత్తుట తెలిసిందే. అయితే ఆషాడమాసం, చిన్నచిన్న చినుకులతో ఆధిత్యుని దర్శనానికి భక్తుల సంఖ్య తగ్గింది. ఇదిలావుంటే స్వామివారి శీఘ్రదర్శనానికి 239 టిక్కెట్లు అమ్ముడుపోగా 18,975 రూపాయలు, కేశ ఖండనకు 990 టిక్కెట్లు విక్రయించగా 9,900 రూపాయలు, 120 మంది సూర్య నమస్కారాలు చేయించుకోవడంతో ఆరువేల రూపాయలు, ప్రసాదాల విక్రయాల ద్వారా 90,000 రూపాయలు ఆదాయం వచ్చింది. కాగా స్వామివారి నిత్యాన్నదాన ప్రసాదాన్ని 590 మంది స్వీకరించారు.