ముద్రగడను కలిసిన తెలగ సంక్షేమ సంఘం సభ్యులు
Published Monday, 25 July 2016లావేరు, జూలై 24: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని ఉద్యమం చేపట్టిన ముద్రగడ పద్మనాభాన్ని జిల్లాకు చెందిన తెలగసంక్షేమసంఘం సభ్యులు ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో కమిటీ తమ సంఘీభావం ప్రకటించారు. మండల తెలగసంక్షేమ సంఘం అద్యక్షులు రొక్కం బాలకృష్ణ, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశ్, జిల్లా బీజేపి కార్యదర్శి శవ్వాన వెంకటేశ్వరరావు, సంఘ ప్రతినిధులు ఎల్.ప్రసాద్, గోవిందరావులు ముద్రగడను కలిసినవారిలో ఉన్నారు. ముద్రగడ చేస్తున్న ప్రయత్నాలను వారు హర్షించారు. జిల్లాకు రావాల్సిందిగా ముద్రగడకు వారు ఆహ్వానించారు.