ఇరువర్గాల ఘర్షణలో ఐదుగురికి గాయాలు
Published Monday, 25 July 2016అవనిగడ్డ, జూలై 24: స్థానిక కొత్త ఎడ్లలంకలోని రెండు కుటుంబాల మధ్య నివేశన స్థలం, భవనం విక్రయానికి సంబంధించి జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘర్షణ జరిగింది. క్షతగాత్రులందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదే కుటుంబంలోని ఒక వర్గానికి చెందిన పి చినబాబు, పి ప్రసాద్లకు గాయాలు కాగా, మరో వర్గానికి చెందిన పి శివ అనే మహిళతో పాటు పి హనుమంతరావు, పి రవికుమార్ కూడా గాయాల పాలయ్యారు. కేవలం ఆస్తి గొడవలకు సంబంధించి తరచూ వారి మధ్య గొడవలు జరుగుతూ వున్నాయి. ఆదివారం మరింతగా పెచ్చరిల్లిన ఇరువర్గాల వారు దాడులు చేసుకున్నారు. వారిలో ఒక వర్గానికి సత్యనారాయణ, వెంకటనారాయణ, శ్రీనివాసరావు కూడా సహకరించినట్లు హనుమంతరావు ఆరోపిస్తున్నాడు. అవనిగడ్డ పోలీసులు హుటాహుటిన వైద్యశాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.