రోడ్డు, నీటి సమస్యలు పరిష్కరించండి
Published Monday, 25 July 2016బంటుమిల్లి, జూలై 24: బంటుమిల్లిలో ప్రధాన సమస్య అయిన బంటుమిల్లి - శింగరాయిపాలెం ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు చేపట్టాలని, బంటుమిల్లి ప్రధాన కాలువకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానించారు. మంచినీరు, సాగునీరు, రహదారులపై ఎంతోకాలంగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోక పోవటంతో వివిధ పార్టీల నాయకులు సమావేశం నిర్వహించి తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఇల్లూరి లీలాకృష్ణ, వైకాపా మండల కన్వీనర్ ముత్యాల నాగేశ్వరరావు, బిజెపి పెడన నియోజకవర్గ కన్వీనర్ ఉప్పాల రాము, శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు వి గంగా నాగేశ్వరరావు, గౌరిశెట్టి నాగేశ్వరరావు, లంకదాసుల అజయ్ ఘోష్, తదితరులు పాల్గొన్నారు.