29న కోటి మొక్కలు నాటుతాం: ఎపి సిఎం
Published Monday, 25 July 2016విజయవాడ: మనం-వనం కార్యక్రమంలో భాగంగా ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాటిన ప్రతి మొక్కనూ పరిరక్షించుకునేలా ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తామన్నారు. హరితాంధ్రప్రదేశ్ను సాకారం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు.