ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు
Published Monday, 25 July 2016సికిందరాబాద్: సికిందరాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రెండోరోజు సోమవారం నాడు రంగం కార్యక్రమం జరిగింది. అమ్మవారి భక్తురాలు స్వర్ణలత రంగం పేరిట భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని ఆమె చెప్పారు. రంగంలో భవిష్యవాణిని తెలుసుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.