ఫీజులు తగ్గించాలని విద్యార్థుల ఆందోళన
Published Monday, 25 July 2016హైదరాబాద్: కార్పొరేటు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, కెజి నుంచి పిజి వరకూ ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం నాడు కూకట్పల్లిలో ఆందోళనకు దిగారు. వారు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.