స్కూటీని ఢీకొన్న బస్సు: హెడ్కానిస్టేబుల్ మృతి
Published Monday, 25 July 2016హైదరాబాద్: స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో సిఆర్పిఎఫ్ హెడ్కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలం తూముకుంట వద్ద సోమవారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హడ్ కానిస్టేబుల్ ధర్మరాజు అక్కడికక్కడే మరణించాడని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.