ప్రైవేటు బిల్లుపై చర్చించాల్సిందే : కాంగ్రెస్
Published Monday, 25 July 2016దిల్లీ: తమ పార్టీ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు చర్చకు రాకుండా అధికార పక్షం అడ్డుకుందని, ఈరోజైనా చర్చకు అవకాశం కల్పించాలని రాజ్యసభలో సోమవారం నాడు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. సభలో బిల్లురాకుండా అడ్డుకోవడం సరికాదని, సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ ఎంపి ఆనంద్ శర్మ అన్నారు. ఈరోజు బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. బిల్లుపై ఇపుడు చర్చ చేపట్టడం నిబంధనల ప్రకారం విరుద్ధమని, ఆగస్టు 5న చర్చకు అవకాశం కల్పిస్తామని డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. అందుకు సంతృప్తి చెందని కాంగ్రెస్ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.