ఎంసెట్-2లో అక్రమాలపై సిఐడి దర్యాప్తు
Published Monday, 25 July 2016హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షలో కొన్ని అవకతవకలు జరిగినట్లు సిఐడి పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కొంతమంది దళారులు ఎంసెట్-2 పేపర్ను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చినందున సిఐడి విభాగం కేసు నమోదు చేసింది. పేపర్ ముద్రణ నుంచి లీకేజీ వ్యవహారం వరకూ అన్ని విషయాలపై సిఐడి దృష్టి సారించింది. సిఐడి నివేదిక వచ్చే వరకూ మెడిసిన్ కౌనె్సలింగ్ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.