మోదీ తెలంగాణ పర్యటన ఖరారు
Published Monday, 25 July 2016హైదరాబాద్: ప్రధాని మోదీ ఆగస్టు 7న తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 7న మద్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. 1.45కి ప్రత్యేక హెలికాప్టర్లో రామగుండం చేరుకోనున్నారు. అక్కడ థర్మల్ విద్యుత్ ప్లాంట్, ఎఫ్సీఐకి శంకుస్థాపన చేస్తారు. 2.25కి ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ను జాతికి అంకితం చేయనున్నారు. 3.10కి వరంగల్ చేరుకోని కాకతీయ టెక్స్టైల్స్ పార్క్, కాళోజి హెల్త్ వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. మిషన్ కాకతీయ పైలాన్ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4.10కి గజ్వేల్లో మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్కు శంకుస్థాపన చేస్తారు. గజ్వేల్లో నిర్వహించే బహిరంగసభకు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రధాని ఢిల్లీ బయల్దేరనున్నారు.