అత్యాచార బాధితురాలి అబార్షన్కు సుప్రీం అనుమతి
Published Monday, 25 July 2016దిల్లీ: అత్యాచార బాధితురాలి కడుపులో పెరుగుతున్న పిండం ఆమె ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని వైద్యుల కమిటీ నివేదికతో అబార్షన్కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 24 వారాల గర్భవతి అయిన బాధితురాలి పిటిషన్ను విచారించిన న్యాయస్థానం దీనిపై ముంబై వైద్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరింది. అత్యాచార బాధితురాలి కడుపులో పెరుగుతున్న పిండం అసాధారణంగా ఉందని ద్యుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అబార్షన్ చట్టం ప్రకారం 20 వారాలు నిండిన పిండం తొలగింపు నేరం. ఈ నేపథ్యంలో ముంబై అత్యాచార బాధితురాలు ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.