మంత్రులను జైలుకు పంపిస్తా: నాగం
Published Monday, 25 July 2016మహబూబ్నగర్: ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో ప్రభుత్వ నిధులను తెరాస సర్కారు కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని, కమీషన్లు దండుకుని మంత్రులు అక్రమంగా సంపాదిస్తున్నారని బిజెపి నేత నాగం జనార్దనరెడ్డి సోమవారం ఆరోపించారు. అవినీతిని వెలికి తీసి ఆ మంత్రులను జైలుకు పంపుతానని ఆయన హెచ్చరించారు. అక్రమ సంపాదనపై తప్ప తెరాస మంత్రులకు అభివృద్ధి పథకాలపై ఆసక్తి లేదన్నారు.