రెండు జీపులు ఢీకొని 8 మంది మృతి
Published Monday, 25 July 2016జైపూర్: పోలీసులపైకి కాల్పులు జరుపుతూ ఖైదీలు జీపులో పారిపోతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో అయిదుగురు ఖైదీలున్నారు. రాజస్థాన్లోని చురూ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. భూ వివాదానికి సంబంధించి పరారైన ఖైదీలు కోహినా గ్రామానికి చేరుకున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి ఖైదీలు కాల్పులు జరుపుతూ జీపులో పారిపోతుండగా మరో జీపు ఢీకొంది. పరారైన మిగతా ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.