తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
Published Monday, 25 July 2016హైదరాబాద్: వైస్ చాన్సలర్ల నియామకాలకు సంబంధించిన కేసు విచారణలో ఉండగా ఆరు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించడం ఏమిటని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లకు పైగా ఆగిన ప్రభుత్వం వీసీల నియామకంపై రెండు, మూడు రోజులు ఆగలేదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆరు వర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.