ఆరు వర్సిటీలకు వీసీల నియామకం
Published Monday, 25 July 2016హైదరాబాద్: తెలంగాణలో ఆరు వర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు వర్సిటీకి డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, జెఎన్టియుకి వేణుగోపాలరెడ్డి, తెలంగాణ వర్సిటీకి సాంబశివరావు, కాకతీయ వర్సిటీకి సాయన్న, ఓయుకి రామచంద్రం, ఆర్జియుకెటికి సత్యనారాయణలను వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.