ఎన్ఎడి ఉద్యోగుల కుటుంబాలకు జగన్ ఓదార్పు
Published Monday, 25 July 2016విశాఖ: చెన్నైలోని తాంబరం వద్ద అదృశ్యమైన విమానంలో వెళుతూ ఇంతవరకూ జాడలేకుండా పోయిన ఎన్ఎడి ఉద్యోగుల కుటుంబాలను వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి సోమవారం పరామర్శించారు. విమానం కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నందున అధైర్య పడవద్దని ఆయన అన్నారు. మర్రిపాలెం, బుచ్చిరాజుపాలెం, మాధవధార తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. భూపేంద్రసింగ్, చిన్నారావు, శ్రీనివాస్, నాగేంద్రరావు, సాంబమూర్తి, వరప్రసాద్ కుటుంబాల వద్దకు వెళ్లి జగన్ ధైర్యం చెప్పారు.