సర్కారు నిరంకుశ వైఖరి వల్లే పోరాటం: కోదండరాం
Published Monday, 25 July 2016మెదక్: మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులను కలవనీయకుండా తెరాస సర్కారు ఆంక్షలు విధించడం అన్యాయమని తెలంగాణ జెఎసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తనను అరెస్టు చేయడం బాధ కలిగించలేదని, రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. బాధిత రైతులను ఎక్కడికి వెళ్లనీయకుండా గ్రామాల్లో పోలీసులను కాపలా పెట్టడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్లే మల్లన్నసాగర్ జలాశయంపై రైతులు పోరాటాలకు దిగుతున్నారన్నారు.