రేవంత్, రాజనరసింహ అరెస్టు
Published Monday, 25 July 2016మెదక్: మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ టీడీపీ నేత రేవంత్రెడ్డిని, బీజేపీ స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహను అరెస్ట్ చేసి గజ్వేల్ పోలీస్స్టేషన్కు తరలించారు. అరెస్ట్ సమయంలో టీడీపీ, ఇతర పక్షాలకు చెందిన కార్యకర్తలు-పోలీసులకు మధ్య కొద్దిసేపుట తోపులాట జరిగింది. మల్లన్నసాగర్ నిర్వాసితులపై ఆదివారం జరిగిన లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం నేడు జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. బంద్లో భాగంగా మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ నుంచి రేవంత్తో పాటు పదిమంది టీడీపీ నేతలు బయలుదేరారు. మార్గమధ్యంలో తుర్కపల్లి వద్దే నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రేవంత్రెడ్డి పోలీసుల కన్నుగప్పి కాన్వాయ్ నుంచి దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అనంతరం తన కారులో గజ్వేల్ వరకు చేరుకున్నారు.