హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ గిలానీ అరెస్ట్
Published Monday, 25 July 2016శ్రీనగర్: నిబంధనలను ఉల్లంఘించి హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్, వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ అనంత్నాగ్కు సోమవారం ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కశ్మీర్ లోయలో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గిలానీ అక్కడి ప్రజలను పరామర్శించడం కోసం కశ్మీర్ లోయలోని అనంతనాగ్ జిల్లా ర్యాలీకి పిలుపునిచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.