అవకాశమిస్తే చాలట?
Published Monday, 25 July 2016తనకు మంచి అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తానంటోంది ఈ గ్లామర్ భామ? ఇంతకీ ఈమె ఎవరో తెలుసా? బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ రూపొందించిన ‘రమణ్ రాఘవ్ 2.0’తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఆకట్టుకున్న తెలుగమ్మాయి -మిస్ ఇండియా ఎర్త్ శోభిత ధూళిపాళ. ఆ సినిమాతో ఈ అమ్మడికి చాలానే అవకాశాలు వస్తున్నాయట. గుంటూరుకు చెందిన ఈ అమ్మడు గ్లామరస్గా కనిపించేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తుంది. కింగ్ఫిషర్ కాలెండర్తో ఫామ్లోకి వచ్చిన ఈ భామ, బాలీవుడ్లోనే సెటిలవ్వాలనే ప్రయత్నాల్లో వుంది. ఇప్పటికే గట్టి ప్రయత్నాల్లో ఉన్న ఈమె క్రేజీ అవకాశాల కోసం చూస్తొందట. అవకాశమిస్తే చాలు.. చూపిస్తానంటోంది.