హోంగార్డుల సంక్షేమానికి ‘ ఏకతా’ పథకం ప్రారంభం
Published Monday, 25 July 2016ఆదిలాబాద్, జూలై 25: హోంగార్డు బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ ఆసరాగా నిల్చేందుకు ముందుంటుందని జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన బాధిత హోంగార్డు కుటుంబ సభ్యులకు రూ. 7లక్షల విలువైన చెక్కులను ఎస్పీ అందజేశారు. ఈ సంధర్భంగా ఎస్పీ ఏకతా పథకాన్ని ప్రారంభిస్తూ హోంగార్డులు విధి నిర్వహణలో చనిపోతే వారికి ఈ పథకం కింద సహాయ నిధి కింద ఒక రోజు వేతనం అందిస్తామని అన్నారు. కుటుంబానికి సంక్షేమ పతకాలతో పాటు కుటుంబం నుండి ఒకరికి ఉద్యోగం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్క్వాటర్ ఆర్ఐ జెమ్స్, ఆర్ఎస్ఐ పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.