కుండపోత వర్షం
Published Monday, 25 July 2016కరీంనగర్ టౌన్, జూలై 25: జిల్లా కేంద్రం కరీంనగర్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా సుమారు గంట సేపు కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షంతో రోడ్లన్నీ నీటితో నిండిపోగా, పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్ళల్లోకి నీరు రావడంతో ఆ నీటిని బయటకు బకెట్లతో పారబోశారు. రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల మురికికాలువలు వరద నీటితో పొంగిపొర్లగా, బహిరంగ ప్రదేశాలు చెరువులను తలపించాయి.