‘ఇందు’ పిటిషన్పై మీ వైఖరి చెప్పండి
Published Tuesday, 26 July 2016హైదరాబాద్, జూలై 25: వైఎస్ జగన్ సంస్థలో అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు తమపై అభియోగం మోపుతూ కేసును కొట్టివేయాలని ఇందు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఐ శ్యామ్ప్రసాద్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై రెండు వారాల్లో వైఖరి తెలియజేయాలని సిబిఐని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు శ్యామ్ ప్రసాద్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, ఐఏఎస్ అధికారిణి రత్నప్రభపై కూడా ఇలాగే ద్రువీకరించని అభియోగాలను మోపుతూ సిబిఐ దాఖలు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసిన ఉదంతాలను ఇందు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున వాదించిన న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఇందు గ్రూప్ చైర్మన్పై పెట్టిన కేసుపై వైఖరి ఏమిటో రెండు వారాల్లో తెలియజేయాలని సిబిఐని హైకోర్టు ఆదేశించింది.