చురుగ్గా రుతుపవనాలు
Published Tuesday, 26 July 2016విశాఖపట్నం, జూలై 25: రాష్ట్రంలో నైరుతి రుతుపనాలు చుర్గుగా ఉన్నాయి. దీనికి తోడు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురియవచ్చని తెలిపారు.