మాజీ ఎంపి పొన్నం అరెస్టు
Published Tuesday, 26 July 2016సిద్దిపేట, జూలై 25: మల్లన్నసాగర్ నిర్వాసితుల పై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా అఖిలపక్షం బంద్ సందర్భంగా సిద్దిపేటకు వచ్చిన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ను కొత్తబస్టాండ్ వద్ద వన్టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సిద్దిపేటలో విలేకర్ల సమావేశంలో పాల్గొన్న అనంతరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్తో కలిసి అనుచరులతో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల బాధితులను ఓదార్చేందుకు పోతున్న క్రమంలో కొత్తబస్టాండ్ వద్ద వన్టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సొంత పూచీకత్తు పై విడుదల చేశారు.