ఆటవిడుపుగా పోలీసుల క్రీడలు
Published Tuesday, 26 July 2016వడ్డేపల్లి, జూలై 25: గత పది రోజులుగా జెఎన్ఎస్ మైదానంలో నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల దేహదారుఢ్య, క్రీడాంశాల పరీక్షల నిర్వహణకు పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం అభ్యర్థులకు మైదానంలో ఎలాంటి క్రీడాంశాల పరీక్షలు జరుగకపోవడంతో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తమ ప్రతిభను పదును పెట్టుకునే పనిలో పడ్డారు. పోలీసు అధికారులందరూ షాట్పుట్ క్రీడలో అధికారులు పోటీ పడ్డారు. ఇది గమనించిన సిపి సుధీర్బాబు షాట్పుట్ అత్యధిక దూరం థ్రూ చేసిన మొదటి ముగ్గురు అధికారులకు నజరానా ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే పోలీసు అధికారులు షాట్పుట్ బాల్ థ్రూ చేయడానికి పోటీపడ్డారు. పోటీల్లో ఇన్స్పెక్టర్ నరేందర్ మొదటి స్థానంలో నిలువగా ఘనపూర్ ఇన్స్పెక్టర్ కిషన్, మడికొండ ఎస్సై విజ్ఞాన్రావు మూడవ స్థానంలో నిలిచారు. ఈ కొద్ది సమయంలో పోలీసు అధికారులు సైతం తాము పోలీసు అధికారులమని మరిచి పోలీసు నియామకాలకు వచ్చిన అభ్యర్థులుగా వ్యవహరించడంతో జెఎన్ఎస్ మైదానంలో సందడి నెలకొంది.