వర్గీకరణ పోరులో కవులు రచయతలు
Published Tuesday, 26 July 2016న్యూఢిల్లీ, జూలై 25: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. సోమవారం మాదిగ కవులు-రచయితలు జంతర్ మంతర్లో జరుగుతున్న నిరసన కార్యమ్రంలో పాల్గొన్నారు. యెండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించుకొని స్వేచ్ఛాప్రతిమ డప్పు కొట్టాలని ఉందని అన్నారు. దండోరా ఉద్యమం మొదలయ్యాకే మాదిగలు తలెత్తుకుని తిరగడం జరిగిందన్నారు. వర్గీకరణపై డప్పోళ్ల రమేష్ రచించిన ‘కవ్వ’ పుస్తకాన్ని మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. దీక్షలో వేముల ఎల్లయ్య, పసునూరి రవీందర్ ఎన్నార్, మాతంగి చిరంజీవులు, స్పందన పాల్గొన్నారు.