లక్ష మార్కును దాటిన బజాజ్ వి అమ్మకాలు
Published Tuesday, 26 July 2016న్యూఢిల్లీ, జూలై 25: బజాజ్ ఆటో ప్రతిష్ఠాత్మక ద్విచక్ర వాహనం ‘వి’ అమ్మకాలు లక్ష మార్కును దాటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక లోహంతో వి బైకులను బజాజ్ తయారు చేస్తున్నది తెలిసిందే. 150సిసి సామర్థ్యంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్కు పరిచయమైన వి బైక్ పంపిణీ మార్చి 23 నుంచి మొదలైంది. కాగా, మార్కెట్లో డిమాండ్ బాగుండటంతో వి బైక్ల ఉత్పత్తిని పెంచే యోచనలో ఉన్నట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ మోటార్సైకిల్ అమ్మకాల విభాగం అధ్యక్షుడు ఎరిక్ వ్యాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్లో దేశీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 బైకుల్లో వి కూడా నిలిచింది.