ఆలయాల కూల్చివేత తగధు
Published Tuesday, 26 July 2016విజయనగరం(టౌన్), జూలై 25: విజయవాడ పరిసరాలలో 36 పురాతన దేవాలయాలను ఇటీవల తొలగించిన అధికారులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దా మధు ఆవేదన వ్యక్తం చేసారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడలో దేవాలయాలు కూల్చివేత విషయంలో అధికారులు కొంతమంది తొందరపడి వ్యహరించారని చెబుతూ తాజాగా విజయనగరం పట్టణం పాతబస్టాండ్ ఆవరణలోని శ్రీవీరాంజనేయ స్వామివారి ఆలయాన్ని కూల్చివేయాలనే నిర్ణయం తీసుకున్నారని ప్రచారంలో ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. భారతీయ సంప్రదాయ ప్రకారం నిర్మించిన పురాతన ఆలయాలను కూల్చివేయడం మంచితి కాదని చెప్పారు. ఎంతోమం భక్తులచేత పూజలు అందుకుంటున్న ఈ ఆలయం విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయం కూల్చి వేత నిర్ణయానికి తాము వ్యతిరేకమని స్పష్టంచేసారు. ఈసమావేశంలో పార్టీ నాయకులు శంబరలక్ష్మీనరసింహం, మజ్జిరమేష్ పాల్గొన్నారు.