ఎపి మంత్రిమండలి సమావేశం ప్రారంభం
Published Tuesday, 26 July 2016విజయవాడ: ఎపి మంత్రివర్గ సమావేశం సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఇక్కడ ప్రారంభమైంది. ఆగస్టు 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణం, మనం-వనం, ఎర్రచందనం వేలం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై మంత్రివర్గ సహచరులతో సిఎం చర్చించే అవకాశం ఉంది.