ఇంద్రకీలాద్రికి పుష్కరశోభ
Published Tuesday, 26 July 2016విజయవాడ: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి, కృష్ణా పుష్కరాల సమయానికి ఇక్కడి ఇంద్రకీలాద్రిని అన్ని విధాలా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై చేపడుతున్న పనులను పరిశీలించారు. పుష్కరాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లు ఇకపై ఏడాది పొడవునా కొనసాగాలన్నారు.