సిబిఐ దాడుల్లో పట్టుబడ్డ పిఎఫ్ ఉద్యోగి
Published Tuesday, 26 July 2016కడప: భవిష్యనిధి (పిఎఫ్) రుణాలను మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటున్న పిఎఫ్ కార్యాలయం గుమస్తాను సిబిఐ అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో ముగ్గురు కార్మికులు తమ పిఎఫ్ ఖాతాల నుంచి రుణం కోసం దరఖాస్తు చేశారు. కడపలోని పిఎఫ్ కార్యాలయంలో గుమస్తా దానం ఇందుకు లంచం అడిగాడు. దీంతో ఆ కార్మికులు సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. 9వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా గుమస్తా దానంను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు తరలించారు.