పాణ్యంలో ఇద్దరు యువకుల హత్య
Published Tuesday, 26 July 2016కర్నూలు: పాణ్యం రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి మృతదేహాలను పొలాల్లో పడేశారు. మృతులను కొలిమిగుండ్ల మండలం బోయఉప్పలపాడు గ్రామానికి దారా లక్ష్మయ్య, దారా ఓబులేశుగా పోలీసులు గుర్తించారు.