బంగాళాఖాతంలో 2 డ్రమ్ముల గుర్తింపు
Published Tuesday, 26 July 2016విశాఖ : మిస్సయిన విమానం జాడ కనుగొనే ప్రయత్నంలో నారింజరంగులో ఉన్న రెండు డ్రమ్ములను బంగాళాఖాతంలో ఎయిర్ఫోర్స్, నావీ సిబ్బంది గుర్తించారు. ఈ డ్రమ్ములు కూలిపోయిన విమానానికి సంబంధించినవిగా అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ డ్రమ్ములు ఆ విమానంకు చెందినవిగా అధికారికంగా ప్రకటించలేదు. నాలుగు రోజుల కిత్రం చెన్నై నుంచి పోర్ట్బ్లెయిర్కు బయలుదేరిన విమానం తప్పిపోయిన విషయం తెలిసిందే. విమానం కూలిపోయి ఉండవచ్చునని, విమానంలో ప్రయాణిస్తున్న 29 మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు.