గజ్వేల్లో కాంగ్రెస్ నేతలు అరెస్టు
Published Tuesday, 26 July 2016మెదక్: లాఠీచార్జిలో గాయపడిన మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను పరామర్శించేందుకు మెదక్ బయలుదేరిన కాంగ్రెస్ నేతలను మంగళవారం నాడ గజ్వేల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ ముందస్తు అరెస్టులు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో కాంగ్రెస్ నేతలు డికె అరుణ, దామోదర రాజనరసింహ, అద్దంకి దయాకర్, శ్రవణ్ తదితరులున్నారు.