ప్రైవేటుబిల్లుపై రాజ్యసభలో మళ్లీ రభస
Published Tuesday, 26 July 2016దిల్లీ: తమ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చ జరపాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం పట్టబట్టారు. ఈ బిల్లుపై ఇప్పట్లో ఓటింగ్ జరిగే అవకాశం లేదని ఇదివరకే తాను రూలింగ్ ఇచ్చానని, నోటీసు ఇస్తే చర్చకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి దూసుకుపోయి నిరసన కొనసాగిస్తున్నారు. బిజెపి సభ్యులు కాంగ్రెస్ ఎంపీలపై ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది.