ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
Published Tuesday, 26 July 2016విజయవాడ: కృష్ణా పుష్కరాల పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు మంత్రివర్గ సమావేశంలో లో కృష్ణా పుష్కరాలు, వనం-మనం కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ సాగింది. కృష్ణా పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల ఇవ్వకపోవడం సబబు కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రేషన్ డీలర్లకు కమీషన్ క్వింటాకు రూ.70 పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.