4న ‘చంద్రోదయం’ ప్రారంభం
Published Tuesday, 26 July 2016శ్రీ శే్వతార్క గణపతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో డి.వి.వి.సాయికుమార్, వెంకటరమణ పసుపులేటి సంయుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ‘చంద్రోదయం’. ఆగస్టు 4న ఒంగోలులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవలే ఈ చిత్ర బ్రోచర్ను హోం మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ,‘ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు చేరువైన తీరును వివరిస్తూ ‘చంద్రోదయం’ను తెరకెక్కిస్తున్నాం. కార్తీక్, పల్లవిశ్రేష్ట, అభిషేక్, శ్రీదేవి, రవివర్మ, పూజిత, సావిత, వర్ష, హరీష్, మలినేని లక్ష్మయ్య, హేమసుందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రాజ్కిరణ్.ఎస్, సినిమాటోగ్రఫి:సుధాకర్రెడ్డి.ఎస్, సహ నిర్మాతలు:గిత్తలూరి వెంకటకృష్ణారావు, కాకు మల్లికార్జున యాదవ్, చింతమ సుబ్బారావు, నిర్మాతలు:వెంకటరమణ పసుపులేటి, డివివి సాయికుమార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం:వెంకట రమణ పసుపులేటి.