నేడు మట్టపల్లిలో బ్రాహ్మణ పరిషత్ సమావేశం
Published Wednesday, 27 July 2016మఠంపల్లి, జూలై 26: తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ కన్వీనర్ల సమావేశం బుధవారం మట్టపల్లి బ్రాహ్మణ సత్రంలో నిర్వహిస్తున్నట్లు హుజూర్నగర్ నియోజకవర్గ కన్వీనర్ బాపుమంచి చంద్రశేఖర్ మంగళవారం విలేఖరులకు తెలిపారు. ఈసమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గంగు భానుమూర్తితోపాటు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని, జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ కన్వీనర్లు, కోకన్వీనర్లు హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో చెన్నూరి మట్టపల్లిరావు, కోటేశ్వరరావు, బొబ్బిల్లపాటి శేషగిరిరావులు పాల్గొన్నారు.