పోలీసుశాఖ రాత్రి పగలు అప్రమత్తంగా వ్యవహరించాలి
Published Wednesday, 27 July 2016విజయవాడ, జూలై 26: కృష్ణా పుష్కరాల సందర్భంగా పోలీసు శాఖ రాత్రి, పగలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ అన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పుష్కర బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. డిఎస్పి ఆ పైస్థాయి అధికారులతో ఎ కనె్వక్షన్ హాలులో నిర్వహించిన ఈ సమావేశంలో విజయవాడ జాగ్రఫీ, పుష్కర నగర్లు, స్నాన ఘాట్లు, తాత్కాలిక బస్స్టేషన్లు అదే విధంగా షాటిలైట్ బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్ల ఆవశ్యకత, క్రౌడ్ మేనేజ్మెంట్, భక్తులు, ప్రజల భద్రతల గురించి చర్చించి, పవర్పాయింట్ ప్రజంటేషర్ ద్వారా వివరించి అవగాహన కలిగించడం జరిగింది.