ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
Published Wednesday, 27 July 2016మోపిదేవి, జూలై 26: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ ఎం శారదా కుమారి ఉత్సవాలను ప్రారంభించారు. కె ఫణి కుమార్ శర్మ ఆలయ సంప్రోక్షణ గావించారు. అనంతరం ఆలయ వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గణపతి పూజ నిర్వహించారు. ప్రధాన అర్చకులు బద్దు పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు, మహన్యాస పారాయణం నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ ఎ మధుసూదనరావు, అధికారులు విఎస్కె మల్లేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.