చంపావతి నదికి జలకళ
Published Wednesday, 27 July 2016గజపతినగరం, జూలై 26: ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు తరువాత చంపావతి నదిలోకి వరద నీరు చేరి నీటితో కళకళలాడుతోంది. ఇంతవరకు నదిలో పశువులు తాగేందుకు సహితం నీరు ప్రవహించని పరిస్థితి ఉండేది. సోమవారం సాయంత్రం గంట్యాడ మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో భారీవర్షం కురవడంతో గుర్లగెడ్డ రిజర్వాయర్ నుండి వచ్చే వరదనీరు చంపావతి నదిలోకి చేరింది. దీంతో 13 వంతుల కాలువ టివి ఛానల్, చిట్టాయవలస-గంగచోళ్లపెంట సాగునీటి కాలువల ద్వారా వరదనీటిని రైతులు మళ్లించి ఉభాలకు సిద్ధం కానున్నారు.