‘తాగునీటిని వృథా చేయరాదు’
Published Wednesday, 27 July 2016మద్దిపాడు, జూలై 26 : వర్షాభావ ప్రభావంతో మండలంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఈవో ఆర్డి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన కార్యదర్శితో కలిసి మద్దిపాడు తదితర ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఈవోఆర్డి మాట్లాడుతూ మద్దిపాడులోని పలు కాలనీల్లోనూ, దళితవాడల్లో మంచినీటిని వృధాగా వదులుతున్నట్లు పేర్కొన్నారు. కనీసం ట్యాప్లు లేనివారు మంచినీటిని మురికి కాలువల్లో వదిలిపెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మురికి కాలువల్లో నీటిని వదలడం వల్ల మురుగునీరు రోడ్డుపై వచ్చి రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు. అలా వృధాగా నీటిని వదులుతున్న వారిని గమనించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరి వెంట గ్రామ కార్యదర్శి అజయ్, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.