ఇంకుడుగుంతలో పడి విద్యార్థి మృతి
Published Wednesday, 27 July 2016కొనకనమిట్ల, జూలై 26: మండలంలోని మర్రిపాలెం ఉన్నత పాఠశాల ఆవరణలో తీసిన ఇంకుడుగుంతలో పడి విద్యార్థి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా ఇంకుడుగుంతలోకి నీరుచేరి గుంత కనిపించకుండా ఉండటంతో ఆడుకుంటున్న విద్యార్థి కోటపాటి సాంబశివ (9) ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంకటలక్ష్మీ, సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలానికి చేరుకొని కుమారుడి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. కొనకనమిట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.